రిపబ్లిక్ హిందుస్థాన్, బజార్ హత్నూర్ : సోమవారం రోజు ముక్కనుమ ల పౌర్ణమి సందర్భంగా బజార్హత్నూర్ మండల కేంద్రంలోని శివాలయంలో శివాలయం పూజారికి సోనాల గ్రామానికి చెందిన జైహింద్ గ్రూప్ సభ్యులు భగవద్గీత పుస్తకాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా వారు భగవద్గీత పారాయణము గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం ఉందని తెలిపారు. ప్రతి ఒక్క హిందు ఇంట్లో భగవద్గీత ఉండాల్సిందేనని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భగవద్గీత అనేది హిందువులకు ఎంతో పవిత్రమైన గ్రంథమని , యుద్ధం సందర్భంగా అస్త్రశస్త్రాలు వదిలేసి యుద్ధభూమి నుంచి వెళ్లిపోతానని పోతున్న అర్జునునికి శ్రీకృష్ణుడు ఉద్దేశం రూపంలో అందించిన ఈ భగవద్గీత శ్రీకృష్ణుడు జగద్గురువు చంపేవాడు పుట్టించే వాడు తానేనని దీనికి ఎవరూ అతీతులు కారని మీరంతా మిథ్య అని తెలియజేశారు. అప్పటివరకు నిద్రమత్తు లో ఉన్నటువంటి అర్జునుడు యుద్ధభూమికి మానసికంగా సిద్ధమై లంకేశ్వరుడు అని అందరికీ తెలిసిన విషయమే కనుక ప్రపంచ హిందువులందరూ గీత పారాయణ ఇంత పవిత్ర గ్రంథంగా గుర్తించి చదివి తరించాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.