republichindustan.in
Newspaper Banner
Date of Publish : 20 June 2022, 2:41 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

బిజెపి మండల అధ్యక్షుని ఆత్మహత్య

రిపబ్లిక్ హిందూస్థాన్, బజార్ హత్నూర్ : బీజేపీ లో చురుకైన నాయకునిగా పెరుపొంది,బజార్ హత్నూర్ మండల బీజేపీ అధ్యక్షునిగా కొనసాగుతున్న గోసుల నాగరాజు (48) పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం జరిగింది. ఆయనకు భార్య లక్ష్మీ,కుమారుడు గణేష్,కూతురు ఉన్నారు. బంధువుల వివరాల ప్రకారం ఆదివారం రాత్రి ఇంట్లో పురుగుల మందు సేవించడముతో హుటాహుటిన ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతిచెందినట్లు తెలిపారు. మృతికి గల కారణాలు,పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది,ఆయన మృతి పట్ల బీజేపీ నాయకులు దిగ్బ్రాంతికి లోనయ్యారు.

Thank you for reading this post, don't forget to subscribe!