republichindustan.in
Newspaper Banner
Date of Publish : 25 January 2024, 8:48 am Digital Edition : REPUBLIC HINDUSTAN

జగనన్న ఇంటిస్థలాలకి రిజిస్ట్రేషన్లు

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పేదల పక్షపాతి అని మరోసారి రుజువు అవుతోంది. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన వైయస్‌ జగన్‌ ప్రభుత్వం.. ఇప్పుడు వాటికి రిజి­స్ట్రేషన్లు కూడా చేయడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించనుంది.

తద్వారా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను రిజిస్టర్‌ చేసిన తొలి ప్రభుత్వంగా రికార్డులకెక్కనుంది. ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధారణమే అయినా ఒకేసారి 30 లక్షల మందికిపైగా ఇవ్వడం, వాటికి రిజిస్టర్‌ చేస్తుండటం దేశం­లోనే ప్రప్రథమం. దీనివల్ల పేదలకు ఆ స్థలాలపై పూర్తి హక్కులు లభిస్తాయి. ఈ నెల 27వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు చేసే కార్యక్రమం భారీ ఎత్తున మొదలు కానుంది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ నేడో, రేపో జారీ కానుంది.