రిపబ్లిక్ హిందూస్ధాన్, బోథ్: మంగళవారం రోజు గూడిహత్నుర్ మండలానికి చెందిన ఆదివాసి నాయకులు 2017 సంవత్సరంలో లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తోలగించాలని డిమాండ్ చేస్తూ, ఆదివాసీ బచావో- లంబాడ హటావో ఉద్యమంలో భాగంగా నమోదైన కేసు నిమిత్తం భోథ్ కోర్టు కు హాజరయ్యారు. ఆదివాసి సేన జిల్లా అధ్యక్షులు ఉయిక లక్ష్మన్, ఆదివాసి సేన రాష్ట్ర నాయకులు పెందోర్ విశ్వనాథ్, ఇచ్చోడ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుడ్మేత జంగు మరియు ఈ కేసును ఉచితంగా వాదిస్తున్న ఆదివాసి అడ్వకేట్ పంద్రం శంకర్,ఆదివాసి నాయకులు పేందూర్ మారుతీరావు, కోవ భగవాన్, పర్చకి భీంరావు,కుంరం శంభు,మడావి గోపాల్, లక్ష్మీన్, రాందాస్, తదితరులు కోర్టుకు హాజరయ్యారు.
Thank you for reading this post, don't forget to subscribe!