అదిలాబాద్ జిల్లా, సెప్టెంబర్ 1 : మహిళల భద్రత మరియు సురక్షితత కోసం ఆదిలాబాద్ జిల్లా షీ టీం బృందం అహర్నిశలు కృషి చేస్తోంది. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆకతాయిల వేధింపులను అరికట్టేందుకు షీ టీం ప్రత్యేక దృష్టి సారిస్తోందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. రాత్రి సమయాల్లో రద్దీ ప్రదేశాల్లో సంచరిస్తూ మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Thank you for reading this post, don't forget to subscribe!

గత నెలలో షీ టీం 27 అవగాహన కార్యక్రమాలను నిర్వహించి, యువతులు, విద్యార్థినులు మరియు కార్యాలయాల్లో పనిచేసే మహిళలకు చైతన్యం కల్పించింది. ఈ కార్యక్రమాల్లో చైల్డ్ మ్యారేజ్, గుడ్ టచ్-బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, సోషల్ మీడియా నేరాలపై అవగాహన కల్పించారు. అలాగే, 42 హాట్స్పాట్లలో 135 సార్లు తనిఖీలు నిర్వహించి, 3 ఎఫ్ఐఆర్లు, 18 పెట్టీ కేసులు నమోదు చేశారు. ఒక కేసులో కౌన్సిలింగ్ ద్వారా సమస్యను పరిష్కరించారు, ఆరు కౌన్సిలింగ్ కార్యక్రమాల ద్వారా కుటుంబ కలహాలను సమర్థవంతంగా పరిష్కరించారు.







షీ టీం చాకచక్యంగా వ్యవహరిస్తూ, జిల్లా వ్యాప్తంగా మహిళలను వేధించే వారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తోంది. ఒకరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఆపత్కాల సమయంలో షీ టీంను 8712659953 నంబర్ ద్వారా సంప్రదించవచ్చని ఆయన సూచించారు.
మహిళల రక్షణ కోసం షీ టీం నిరంతరం అందుబాటులో ఉంటూ, జిల్లాలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు.