republichindustan.in
Newspaper Banner
Date of Publish : 21 December 2023, 4:46 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

అక్రమ కొనుగోళ్లు, తుకాలలో మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :

అక్రమ కొనుగోళ్లు, తుకాలలో మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్ లో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అక్రమ పత్తి కొనుగోళ్లు, రైతులను మోసం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ, తూనికలు కొలతల శాఖల అధికారులతో జిల్లా, మండల స్థాయిలలో కమిటీలను ఏర్పాటుచేయాలనీ సూచించారు. ఈ సమావేశంలో శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మహాతో, మార్కెటింగ్ శాఖల అధికారులు శ్రీనివాస్, మధుకర్, తదితరులు పాల్గొన్నారు.

Thank you for reading this post, don't forget to subscribe!