
ఆదిలాబాద్, రిపబ్లిక్ హిందుస్థాన్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వ్యవసాయ పరిశోధనా కేంద్రం లో
సోమవారం రోజు భారతరత్న డా. బి .ఆర్. అంబేద్కర్ 65 వ వర్ధంతి ( మహా పరినిర్వన్ దినోత్సవం) ని పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహన్ ఆధ్వర్యంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన శాస్త్రవేత్త డా. శ్రీధర్ చౌహన్ మాట్లాడుతూ డా . బి.ఆర్ . అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అంతేకాకుండా వారు ఒక నిమ్న స్థాయి కుటుంబంలో జన్మించి , సామాజిక మరియు ఆర్థిక అసమానతల వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని దేశం గర్వించే స్థాయికి ఎదగడం ఎంతో గొప్ప విషయమని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు . అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శాస్త్రవేత్తలు డా . కె . రాజశేఖర్ , డా. డి . మోహన్ దాస్ , శ్రీ జి . అనిల్ కుమార్ , వారి వారి భావాలను సిబ్బందితో పంచుకొన్నారు .
ఈ కార్యక్రమంలో పరిశోధన స్థానం సిబ్బందియైన ఏఈఓ ఎం . మహేష్ , ఎస్సార్ఫ్ ఎ . శ్రీకాంత్ , యం . నరేష్ , ( టైంస్కేల్ ) , ఎస్ . దేవానంద్ , వై . రవి , జె . పోతన్న , టి రాములు ఆఫీస్ సబార్డినేట్స్ మరియు ఆర్ . నవీన్ , జి . హరీష్ , ప్రొజెక్ట్ అసిస్టెంట్స్ మరియు పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు , నాన్ టీచింగ్ సిబ్బంది , అవుట్ సోర్సింగ్ సిబ్బంది , టైం స్కేల్ మరియు కాంట్రాక్టు కార్మికులు పాల్గొని డా . బి . ఆర్ . అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగినది .
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments