నటనకు స్వస్తి.. కంగనా రనౌత్ కీలక నిర్ణయం
2024 పార్లమెంట్ ఎన్నికల వేళ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో మండి స్థానంలో గెలిస్తే నటనకు స్వస్తి చెబుతానని ఆమె చెప్పారు. 2024 లోక్సభ ఎన్నికలలో ఆమె బీజేపీ నుంచి పోటీ చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఎన్నికలను కంగనా చాలా సీరియస్గా తీసుకోవడం గమనార్హం.
Thank you for reading this post, don't forget to subscribe!