Hyderabad: అధికారులు నటుడు మురళీ మోహన్కు ‘హైడ్రా’ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం .
సీనియర్ నటుడు, టీడీపీ మాజీ ఎంపీ మురళీ మోహన్కు చెందిన జయభేరి సంస్థకు ‘హైడ్రా’ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్లోని రంగలాల్ కుంట ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలు తొలగించాలని నోటీసుల్లో పేర్కొంది. 15 రోజుల్లోగా కూల్చకపోతే తామే కూలుస్తామని హైడ్రా హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
Thank you for reading this post, don't forget to subscribe!