Friday, February 7, 2025

Accident : అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా… ఒకరి పరిస్థితి విషమం

గుడిహత్నూర్ : ట్రాక్టర్ బోల్తా పడి ఒకరికి తీవ్ర గాయాలు అయిన సంఘటన గుడిహత్నూర్ మండలంలో మేకలగండి వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది . స్థానిక ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం . మండలంలోని ధాంపూర్ గ్రామానికి చెందిన రత్నం రాకేష్ ( 45 ) తన స్వంత ట్రాక్టర్ తీసుకొని ఆదిలాబాద్ వైపు వెళ్తున్న క్రమంలో మేకలగండి వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది .

దీంతో రాకేష్ కు తీవ్రగాయాలు కావడంతో అతన్ని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించగా , పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ కు తరలించినట్లు సమాచారం .


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!