బజార్ హత్నూర్ : మండల కేంద్రంలోమన ప్రియతమ నాయకుడు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పోరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా బుధవారం రోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా మండల అధ్యక్షులు పోరెడ్డి శ్రీనివాస్, మరియు నాయకుడు సుకుదేవ్ మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిరంకుశ నిబంధన పాలన నుండి విముక్తి పొందిన రోజు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకన్న, గజానంద్,శంకర్, ఈశ్వర్,నాగోరావ్, లక్సమన్,రమణ,రాజు, నందు,కళ్యాణ్, వినాయక్, బలిరామ్, శేఖర్, లింగన్న పవన్, మహేష్ ప్రసన్న రావు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.