తండ్రిని చంపిన కేసులో కొడుక్కి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష
తాగడానికి డబ్బులు ఇవ్వలేదని తండ్రిని బండరాయితో కొట్టి చంపిన కుమారుడు రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్: తాగుడుకు బానిసై డబ్బులు ఇవ్వనందున తండ్రిని చంపిన కేసులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు కొడుకుకి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.... ఫిర్యాదుదారు ముదిగంపల్లి లక్ష్మి w/o ముదిగంపల్లి బొందియాలు అనే మహిళ తన కూతురు బంధువులు చనిపోయిన కారణంగా జరిగే కార్యక్రమాలలో పాల్గొనడానికి తేదీ 25-07-2021 రోజున స్థానిక కేఆర్ కే కాలనీ కి...