మార్నింగ్ స్టార్ బస్సు బోల్తా…. తప్పిన పెను ప్రమాదం
*మార్నింగ్ స్టార్ బస్సు బోల్త* రాజమండ్రి నుంచి ప్రయాణికులతో బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు జాతీయ రహదారిపై బోల్తా పడింది. బాపులపాడు మండలం వీరవల్లి గ్రామ సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బస్సులో ఎనిమిది మంది ప్రయాణికులు ఉండగా ఎవరికి పెద్దగా గాయాలు కాలేదు. బస్సు డ్రైవర్ క్లీనర్ కు చిన్నపాటి గాయాలు అయ్యాయి. రహదారిపై బస్సు బోల్తాపడడంతో వాహనాలు రాకపోకలకు అంతరాయం కలగడంతో పోలీసు సంఘటన స్థలానికి చేరుకొని వాహనాలు రాకపోకలను క్రమబద్ధీకరించారు.