మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి సోమవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ జాతీయ రహదారి పై జరిగింది. మేడ్చల్ లో నివాసముండే ప్రసాద్(40) అతని సోదరితో కలిసి ద్విచక్ర వాహనంపై చెక్ పోస్ట్ వైపు వెళ్తున్నాడు. జాతీయ రహదారి పై ఫ్లైఓవర్ పనుల కారణంగా ఏర్పడిన గుంత వద్ద పడిపోవడంతో ఈ ఘటన చోట చేసుకుంది.