ఢాకాలో భారీ అగ్నిప్రమాదం 43 మంది మృతి
బంగ్లాదేశ్ : మార్చి01బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవిం చింది. ఈ ప్రమాద ఘటనలో ఇప్పటివరకు 44 మంది మరణించగా..మరో 22 మంది తీవ్రంగా గాయ పడ్డారు. ఢాకాలోని అనేక రెస్టారెంట్లు ఉన్న బెయిలీ రోడ్లోని ఏడంతస్తుల వాణిజ్య భవనంలో గురువారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగారు.