వైఎస్ ష‌ర్మిల అరెస్ట్

ఏపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలను పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. మెగా డీఎస్సీ ప్రకటించా లంటూ, కాంగ్రెస్ చేపట్టిన 'ఛలో సెక్రటేరియట్' ఉద్రిక్తంగా మారిన నేప‌థ్యంలో ష‌ర్మిల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రరత్న భవన్ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో షర్మిల ర్యాలీగా సచివాల యానికి బయల్దేరగా.. కాంగ్రెస్ శ్రేణులు, పోలీసు లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి పోలీసులు షర్మిలను కొండవీటి ఎత్తిపోతల వద్ద అరెస్ట్ చేసి స్టేష‌న్‌కు తరలించారు..