అమాయకుడ్ని కొట్టిచంపారు
కిడ్నాపర్ అనుకుని విచక్షణారహితంగా దాడి దెబ్బలు తాళలేక చనిపోయిన పశువుల కాపరి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అమానుషం అమాయకుడిని కిడ్నాపర్గా అనుమానించారు.అతడు చెప్పేది వినకుండా దారుణంగా కొట్టి చంపారు. పశువుల కాపరిపై ప్రతాపం చూపి ప్రాణం తీసిన అమానుష ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. నిజామాబాద్ మండల పరిధిలోని ఖానాపూర్కు చెందిన రాజు (50) కాపరి పశువులను మేతకు వదిలి చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతుంటాడు. సోమవారం ఉదయం రాజు గాయత్రీనగర్ కాలనీకి వెళ్లాడు. అతడి...