భారాస నేతలు శాపనార్థాలు పెడుతున్నారు: రేవంత్‌ ఆగ్రహం

కేసీఆర్‌ పదేళ్ల పాలనలో తెలంగాణను విధ్వంస రాష్ట్రంగా మార్చారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇంద్రవెల్లి సభలో సీఎం మాట్లాడుతూ..కేసీఆర్‌ కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందా?భారాస ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పు తెచ్చింది.ఆయన ఏనాడైనా అడవిబిడ్డల గురించి ఆలోచించారా?15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ చేస్తాం.త్వరలోనే రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని ప్రారంభిస్తాం.కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కాలేదు..భారాస నేతలు శాపనార్థాలు పెడుతున్నారు.కేసీఆర్‌ పదేళ్లలో ఏమీ చేయలేదు..అలాంటిది మేం 2 నెలల్లోనే చేయడం సాధ్యపడుతుందా అని ప్రశ్నించారు.