పోలీసులు ఫోన్ లాక్కున్నారని ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు
సంగారెడ్డి - పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో సంతోష్ అనే యువకుడు పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న వీడియోలు తీయడం గమనించిన పోలీసులు అతని ఫోన్ లాక్కుని ప్రశ్నించడంతో భయపడి పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ నుండి పెట్రోల్ తెచ్చుకొని ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.