ఆర్మీలో తొలి మహిళా సుబేదార్‌గా ప్రీతి

న్యూఢిల్లీ: ట్రాప్‌ షూటర్‌గా అంతర్జాతీయ పతకాలు సాధించిన క్రీడాకారిణి, ఆర్మీ హవాల్దార్‌ ప్రీతీ రజక్‌ చరిత్ర సృష్టించారు. ఆర్మీలో సుబేదార్‌గా పదోన్నతి సాధించి, ఆ ఘనత సాధించిన తొలి మహిళగా నిలిచారు. 19వ ఆసియా గేమ్స్‌లో టీమ్‌ ఈవెంట్‌లో వెండి పతకం సాధించి ఛాంపియన్‌ ట్రాప్‌ షూటర్‌గా పేరొందిన ప్రీతీ 2022లో సైన్యంలో చేరారు. కార్ప్స్‌ ఆఫ్‌ మిలిటరీ పోలీస్‌లో హవాల్దార్‌గా విధుల్లో చేరారు. ఇలా చేరిన తొలి క్రీడాకారిణి కూడా ఆమే! ట్రాప్‌ విమెన్‌ ఈవెంట్‌ విభాగంలో ప్రీతి దేశంలో ఆరో ర్యాంకర్‌....