రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :
అనుమానస్పదంగా వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని సిరిచేల్మా గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని సిరిచెల్మ గ్రామానికి చెందిన రేగుంట నారాయణ అనే వ్యక్తి మృతదేహం ఎల్లమ్మ గూడ వాగు వద్ద అనుమానస్పదంగా పడి ఉండడంతో స్థానికులకు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చెప్పట్టారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.