రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లబెల్లి : నల్లబెల్లి మండల కేంద్రంలో సమయం దాటిన సొసైటీ మరియు అంగన్వాడి కేంద్రంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. జాతీయ జెండా ఎగురవేసిన అధికారులు నియమాలను గాలికొదిలేశారు.


నియమాలు ఎం చెబుతున్నాయి…
జెండాలోని తెలుపురంగు మధ్యలో అశోక ధర్మచక్రం (24 ఆకులు) నీలం రంగులో వుండాలి. జెండాను ఎగురవేయటం మరియు దించటం అనేది సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపే జరగాలి. జెండాను నేలమీదగాని, నీటిమీదగానీ పడనీయకూడదు. జెండాను ఎగురవేసేటపుడు వడిగా (వేగంగా) ఎగురవేయాలి.