republichindustan.in
Newspaper Banner
Date of Publish : 04 June 2022, 3:45 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

కేసీఆర్ రాజ్యంలో మహిళకు రక్షణ లేదు

🔶 బీజేవైయం నాయకుల ప్రమోద్ గౌడ్

◆ బాలిక కేసును వెంటనే సీబీఐ కి అప్పగించాలి
◆ నిందితులు ఎవరు అయిన కూడా కఠిన చర్యలు చేపట్టాలి
◆బాధిత కుటుంబాన్నికి వెంటనే న్యాయం జరగాలి

రిపబ్లిక్ హిందుస్థాన్ నల్లబెల్లి : జూబ్లీహిల్స్ బాలికపై అఘాయి త్యం చేస్తే కనీసం స్పందించరా అంటూ బీజెవైయం నాయకులు ప్రమోద్ గౌడ్ మండిపడ్డారు. ఐదు రోజులైనా నిందితులను అరెస్ట్ చేయకుండా కేసును నీరు గారుస్తారా అని ప్రశ్నించారు. చంచల్గూడ జైలులో ఉండాల్సిన వాళ్లను సేఫ్ ప్లేస్ లో ఎలా పెడుతారని అన్నారు. ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే సీఎం కేసీఆర్ ఫిడేలు వాయిస్తు న్నారా అని ధ్వజమెత్తారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు స్పందించకపోవడంతో ప్రజలకు వారిపై నమ్మకం పోతున్నద ని చెప్పారు. ఎంఐఎం, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉండడంతోనే నిందితులను తప్పించేందుకు రాష్ట్రసర్కారుట్ర చేస్తున్నదని ఆరోపించారు . ఇ యొక్క కేసును తప్పు దారి పాటించేఅందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది . బాధిత కుటుంబాన్నికి న్యాయం జరిగే వారికి బీజేపీ బీజేవైయం పోరాటం చేస్తుందనీ అన్నారు.