republichindustan.in
Newspaper Banner
Date of Publish : 02 May 2022, 11:36 am Digital Edition : REPUBLIC HINDUSTAN

గుట్కా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

— రూ 18,000/- విలువచేసే రాష్ట్రప్రభుత్వం నిషేధిత గుట్కా స్వాధీనం –
— నిందితుని అరెస్టు, ఆదిలాబాద్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
— వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ రెండవ పట్టణ సిఐ కె శ్రీధర్

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
సోమవారం ఉదయం స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ ఏరియా నందు గల కరన్ ట్రేడర్స్ నందు రాష్ట్ర ప్రభుత్వం మెసేజ్ తగ్గట్టుగా విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం తో రెండవ పట్టణ సీఐ కే శ్రీధర్ ఆధ్వర్యంలోని బృందం తనిఖీ చేయగా కరన్ ట్రేడర్స్ నందు ఏ నిందితుడు షేక్ అఫ్రోజ్ s/o అల్తాఫ్ (24) కు సంబంధించిన 18 వేల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం నిషేధిత గుట్కా లభించిందని తెలిపారు. రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ఈ ఆపరేషన్లో రెండవ పట్టణ ఎస్ఐ కె విష్ణు వర్ధన్ సిబ్బంది కరీం తదితరులు పాల్గొన్నారు.