హిందుస్థాన్, ఇచ్చోడ : సోమవారం రోజు ఇచ్చోడ మండల కేంద్రములోని జరిగిన రెండు వివాహాలకు కార్యక్రమాలకు బోథ్ శాసనసభ్యుడు రాథోడ్ బాపురావు హాజరయ్యారు. విట్ఠల్ రెడ్డి గార్డెన్ లో జరిగిన తెరాస పార్టీ సీనియర్ నాయకుడు దుక్రే సుభాష్ పటేల్ బంధువుల పెళ్లికి, అదేవిధంగా గంగారెడ్డి గార్డెన్ లో జరిగిన గుడిహత్నూర్ మండలానికి చెందిన పార్టీ కార్యకర్త నాగనాథ్ అప్ప కూతురు వివాహానికి హాజరై నూతన వధువరులను ఎమ్మెల్యే ఆశీర్వదించారు. ఆయన వెంట ఇచ్చోడ,గుడిహత్నూర్ మండల కన్వీనర్లు ఏనుగు కృష్ణ రెడ్డి, కరాడ్ బ్రహ్మానందం, జాధవ్ రమేష్, సుద్దవార్ వెంకటేష్, దాసరి భాస్కర్, రాథోడ్ ప్రవీణ్, పహాడ్ దిలీప్, సుధాకర్ తదితరులు ఉన్నారు..