republichindustan.in
Newspaper Banner
Date of Publish : 29 November 2021, 4:22 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

BOATH : వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎంపీ

రిపబ్లిక్ హిందుస్థాన్, బజార్హతనూర్ :
సోమవారం రోజు మాజీ ఎంపీ , మాజీ మంత్రి గోడం నగేష్ బజార్హత్నూర్ లో మాజీ ఎంపిపి అప్కకిషన్ తమ్ముని కూతురు వివాహ కార్యక్రమం లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అక్కడ నుండి గొల్లాపూర్ గ్రామంలో డీలర్ ప్రేమ్ సింగ్ తమ్ముని కూతురు వివాహం లో పాల్గొని మళ్లీ గుర్రాల తండ గ్రామంలో గులాబ్ సింగ్ టిఆర్ఎస్ కార్యకర్త గారి కోడలు వివాహం లో పాల్గొన్నారు.
ఆ తర్వాత ధన్నూర్ గ్రామంలో మాజీసర్పంచ్ అన్నయ్య మృతిచెందిన విషయం తెలుసుకుని వారి కుటుంబాన్ని పరామర్శించారు. మృతికి గల గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కదంప్రశాంత్ , జి సి సి డైరెక్టర్ మెశ్రం భూమన్న , సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి , సర్పంచ్ విజయ్ జీ రాజేశ్వర్ రెడ్డి , ఎంపిటిసిలు జుగధ్రావు ,రాజేష్ , రామారావు , మాజి సర్పంచి మురళి గడ్డలరమణ, కుమ్మరి రమణ తదితరులు పాల్గొన్నారు.