రిపబ్లిక్ హిందుస్థాన్, కొమురం భీం అసిఫాబాద్ : కొమురం భీం అసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో ప్రధాన రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో అదుపు తప్పి పక్కనే వెళ్తున్న లారీ కింద పడి మహిళ మరియు బాలుడు (5) మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా స్థానిక ఆసుపత్రికి తరలించారు.