republichindustan.in
Newspaper Banner
Date of Publish : 12 October 2021, 4:27 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

చుక్కల దుప్పిని పిల్లను రక్షించిన అధికారులు

రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని పకీర్ నాయక్ తండా గ్రామంలో అవులమందతో కలిసి ఒక చుక్కల దుప్పి పిల్ల గ్రామంలో కి వచ్చేసింది.

ఇచ్చోడ కేటీఆర్ రేంజ్ అటవీ శాఖ అధికారి వహబ్ అహ్మద్ తెలిపైన వివరాల ప్రకారం సుమారు ఒక నెల వయసున్న దుప్పి పిల్లను గ్రామస్తులు గమనించి ఇచ్చోడ అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దుప్పి పిల్లను అధికారులు సురక్షితంగా రక్షించి జన్నారం లోని రి హాబీటేషన్ కేంద్రానికి తరలించారు. వన్యప్రాణులు గ్రామంలో తమకు సమాచారం ఇవ్వాలని అన్నారు.