రియాద్, మార్చి 31: సౌదీ అరేబియాలోని రియాద్లో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు మేరకు గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.
Thank you for reading this post, don't forget to subscribe!

ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు, ఎన్నారై అధ్యక్షుడు మరియు ఏపీ ఎన్నార్టీ చైర్మన్ వేమూరి రవి, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ కె. బుచ్చిరాం ప్రసాద్ వీడియో కాల్ ద్వారా గల్ఫ్ దేశాల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలతో మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగు ప్రజలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.

రియాద్ టీం సభ్యులు తిరుపతిస్వామి స్వర్ణ (స్వామి), మహేంద్ర వాకాటి, శివ మోరంపూడి, శివ దబ్బకూటి, అనిల్ మర్రి, రామ్ మద్దుకూరి, నరేష్ చెన్నుపాటి, హరీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రవి మేడూరి, మోహన్, వెంకట్ దాసరి, ప్రవీణ్, సుధాకర్, రాజేష్, రాకేష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన కారణంగా తాము విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందగలిగామని వారు గుర్తు చేసుకున్నారు.
మహిళల భాగస్వామ్యం ప్రత్యేక ఆకర్షణ
మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ శ్రీదేవి వాకాటి, వనజ, విద్య, దీప్తి, శిరీష తదితర మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. వారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలను ఉత్సాహంగా జరిపారు. మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
కార్మికులతో కలిసి వేడుకలు
రియాద్ సమీప ప్రాంతాల్లో రాఘవేంద్ర చౌదరి, అన్నవరం, అంజి, షేక్ అజుముతుల్లా ఆధ్వర్యంలో గృహనిర్మాణ కార్మికుల మధ్య కూడా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం కార్మికులకు ఉత్సాహాన్ని కలిగించిందని నిర్వాహకులు తెలిపారు.
చివరిగా, సౌదీ అరేబియాలో నివసిస్తున్న టీడీపీ అభిమానులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, 2029 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.