రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్: బీజేవైఎం ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన గొతి సునీల్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందే విధంగా కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో ఆదిలాబాద్ జిల్లా భారతీయ జనతాపార్టీ యువమోర్చా (BJYM) జిల్లా కార్యదర్శి బాధ్యత అప్పగించిన ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్,యువమోర్చా జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మనంద్ కృతజ్ఞతలకు తెలిపారు.
Thank you for reading this post, don't forget to subscribe!