గుడిహత్నూర్ : గుడిహత్నూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికలను ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు అధ్యక్షునిగా బండారి రవీందర్,గౌరవ అధ్యక్షులుగా చట్ల దశరథ్ రెడ్డి,ప్రధాన కార్యదర్శిగా రంజాన్,ఉపాధ్యక్షులుగా నాగుల సతీష్,అశోక్ గౌడ్,కోశాధికారిగా విజయ్ రెడ్డి,కార్యదర్శులుగా సత్యనారాయణ,కొండా ప్రశాంత్,బొల్లోజు నరేష్, లు సలహాదారులుగా గన్నోజి శ్రీనివాస్,ముండే మురళీధర్, శ్రీనివాస్, రాథోడ్ సిద్ధార్థ సభ్యులుగా మహమూద్,నగేష్ లను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు పర్యవేక్షకులుగా గౌరవ అధ్యక్షులు దశరథ్ రెడ్డి, ముండే మురళీధర్ వ్యవహరించారు.