republichindustan.in
Newspaper Banner
Date of Publish : 03 September 2021, 2:47 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

ఘనంగా ఆచార్య జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆవిర్భావ దినోత్సవం..

రిపబ్లిక్ హిందూస్థాన్ , ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం రోజున వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ప్రధాన శాస్త్రవేత్త ( అగ్రానమి ) & హెడ్ డా. శ్రీధర్ చౌహాన్ ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ 7 వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకొన్నారు .

Thank you for reading this post, don't forget to subscribe!

ఈ సందర్భంగా డా. శ్రీధర్ చౌహన్ మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ తెలంగాణా ఉద్యమానికి ఇచ్చిన స్ఫూర్తికి చిహ్నంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆచార్య జయశంకర్ గారి పేరును పెట్టడం గర్వించ దగ్గ విషయమని అన్నారు . ఈ వ్యవ్యసాయ పరిశోధన స్థానంలో అందరం కస్టపడి పనిచేయడం వ్యవసాయ పరిశోధన స్థాన సిబ్బందిని కష్టపడి జిల్లలో సాగుచేసే వివిధ పంటలలో పరిశోధన జరిపి వాటి ఫలాలను రైతుల పొలాల్లోకి తీసుకువెళ్లి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడినట్లయితేనే వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సరియైన గుర్తింపు లభించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు .

అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డా.వి.తిరుమల రావ్ , సీనియర్ శాస్త్రవేత్త శ్రీ కె . రాజశేకర్ , శాస్త్రవేత్త , డా , డి . మోహన్ దాస్ , శాస్త్రవేత్త , డా . యం . రాజేందర్ రెడ్డి , శాస్త్రవేత్త మరియు శ్రీ యస్ . దేవానంద్ , జె.ఎ.సి.టి మొదలగు వారు తమ అనుభవాలను సిబ్బందితో పంచుకొన్నారు. కార్యక్రమంలో వి. శ్రీనివాస్ , సీనియర్ అసిస్టెంట్ , సుమిత్ కుమార్ రికార్డు అసిస్టెంట్ , యం . నరేష్ , ( MTS ) , జె . పోతన్న , ఆఫీస్ సబార్డినేట్ , వై . రవి , యన్ . అరుణ్ కుమార్ , ఆర్ . నవీన్ , ప్రాజెక్ట్ అసిస్టెంట్ , యం . పోచ్చుబాయి , A.W.M మరియు ఆర్ . గంగయ్య ఈ కార్యక్రమంలో పరిశోధన స్థానం నాన్ టీచింగ్ సిబ్బంది , అవుట్ సోర్సింగ్ సిబ్బంది , టైం స్కేల్ మరియు కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు .