republichindustan.in
Newspaper Banner
Date of Publish : 08 September 2021, 4:32 am Digital Edition : REPUBLIC HINDUSTAN

ఏజెన్సీలో ఉన్న గిరిననేతరులకు రైతు బంధు ఇవ్వాలి ……

జిల్లా కలెక్టర్ కలిసిన జడ్పీ చెర్మెన్ జనార్ధన్ రాథోడ్, బోథ్ శాశన సభ్యులు రాథోడ్ బాపురావు

రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ : ఏజెన్సీలో నివసిస్తూ ప్రభూత్వ భూములు సాగు చేస్తున్న గిరిజనేతరులకు రైతు బంధు ఇవ్వడానికి ప్రభూత్వానికి నివేదిక పంపాలని కోరుతూ జడ్పీ చెర్మెన్ జనార్దన్ రాథోడ్ ,బోథ్ శానసభ్యులు రాథోడ్ బాపురావు కలిసి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను కలిసి చర్చించారు.

అదేవిధంగా అధిక వర్షం కారణంగా చాలా గ్రామాల్లో జరిగిన పంట నష్టం గురించి, దెబ్బ తిన్న రోడ్ల పై ప్రత్యేక శ్రద్ధ వహించి అభివృద్ధి పరమైన చర్యలు వెంటనే గైకొనలని కోరారు. ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని కలెక్టర్ చెప్పారు.కార్యక్రమంలో జెసి మరియు గిరిజనేతరుల నాయకులు యూనిస్ అక్బనీ, జాడే నాగోరావ్,జీవ వైవిధ్య కమిటీ సభ్యులు మరసుకొల తిరుపతి తదితరులు ఉన్నారు.