రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడ అటవీశాఖ కార్యాలయంలో అటవీశాఖ అమరుల సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భంగా అడవి సంపద రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగం మరువలేని దాని అటవీశాఖ క్షేత్రాధికారి వహబ్ అహ్మద్ అన్నారు. ఇప్పటి వరకు ఎనిమిది మంది ఉమ్మడి ఆదిలాబాద్ అటవీశాఖ సిబ్బంది వీధిలో తమ ప్రాణాలు అర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో అటవీ ఉపక్షేత్రాధికారి జె శ్రావణ్ కుమార్ , ఎఫ్ఎస్ఓలు అర్.వసంత్ , ఎం.రవి మరియు సిబ్బంది పాల్గొన్నారు.