తలమడుగు మండలంలోని దొర్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన వైకుంఠధామమును బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని అన్నారు. అనేక రకాల పథకాల వల్ల అభివృద్ధి అన్ని విభాగాల్లో జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ. రమాకాంత్ , స్థానిక జడ్పిటిసి గోక గణేష్ రెడ్డి , స్థానిక ఎంపిపి కళ్యాణ్ లక్ష్మీ రాజేశ్వర్ , మండల పార్టీ కన్వీనర్ తోట వెంకటేష్ , ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి కిరణ్ కుమార్, జిల్లా నాయకులు కాటి పెళ్లి శ్రీనివాస్ రెడ్డి , దేవాపూర్ సర్పంచ్ అబ్దుల్లా, స్థానిక ఎంపీటీసీ చంటి, గ్రామస్థులు రామయ్య, ఆశన్న యాదవ్, పోచన్న, సునీత రెడ్డి, గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు, టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments