★ ముసుగులు తీయండి
★ రైతన్న కంట కన్నీరు మంచిది కాదు
★ వ్యవస్థలు నిర్వీర్యం అయితే రైతు రోడ్డుపైకి

( ప్రముఖ పరిశోధన పాత్రికేయులు అనంచిన్ని వెంకటేశ్వరరావు, 9440000009 ప్రత్యేకంగా అందిస్తున్నా కథనం)
‘అన్నదాత’ ఎంత గొప్ప పదం. మనిషి లక్షల కోట్లు సంపాదించినా… మనిషి బతకడానికి మాత్రం ఆ డబ్బు మింగటానికి, తినడానికి పనికిరాదు. కావల్సింది మాత్రం జస్ట్ నాలుగు మెతుకులు. ఇది మరిచిన సమాజం ‘రైతు’ని మరిచింది. ఈ ‘లాజిక్’ కనిపెట్టిన ‘దొర’ ముసుగులో వచ్చిండు. ఇప్పుడు బయటపడ్డాడు. వ్యవసాయంపై అవగాహన లేని తనం నెమ్మది నెమ్మదిగా అందరికీ తెలిస్తోంది. నిజస్వరూపం కూడా బట్టబయలు అవుతోంది.
అసలేం జరిగిందంటే..?:
ఇక రైతుల నుంచి ఎక్కువ కొనేది లేదు. వరి మాన్పించి, రైతులను ప్రత్యామ్నాయం వైపు మళ్లించాలి. అంతా కేంద్ర సర్కారు నిర్వాకమే. ఓ ముందుచూపు లేదు, అంతర్జాతీయ ఎగుమతుల్లేవు, దొడ్డు బియ్యం, బాయిల్డ్ బియ్యం ఒక్క బస్తా కూడా కొనబోమని చెబుతున్నది. దాదాపు ప్రతి పత్రిక పతాక శీర్షిక ఇదే.! తమకు పొలిటికల్ నష్టం ఏమీ లేకుండా, బీజేపీని ఇరుకునపెట్టడానికి ఇలా నెపాన్ని కేంద్రంపైకి నెట్టేస్తున్నది తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వానికి మొదటి నుంచీ వ్యవసాయం మీద- కొనుగోళ్ల మీద ఓ ప్రణాళిక లేదు. అసలు వాటి గురించే ఆలోచించేవాళ్లు ఎవరున్నారని..! ఓ దీర్ఘకాలిక వ్యూహమో, పాలసీయో ఉంటే కదా…! అప్పటికప్పుడు ‘దొర’ ఏది చెబితే అదే పాలసీ… గుర్తుందా..? ‘నియంత్రిత పంటల విధానం’ అంటూ ఆమధ్య ప్రచారం చేశారు, మొక్కజొన్న వేయొద్దు, బయట ‘మార్కెట్ లేదు, రేటు రాదు’ అని రైతుల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు.
అసలు కారణం ఏమిటంటే..?:
మొక్కజొన్న కొనుగోళ్ల భారం తగ్గించుకోవడం..! పత్తి వేయండి, మన తెలంగాణ బ్రాండ్ అంటేనే సూపర్, లాంగ్ స్టేపుల్, ధరకు తిరుగులేదు అని ప్రచారం చేశారు. పత్తిని ఎలాగూ తను కొనదు కదా, మార్కెట్ శక్తుల గుప్పిట్లోకి రైతుల్ని ఇలా తరలించసాగింది… (సీసీఐ కొనుగోళ్లు అనేది మరో పెద్ద అధ్యాయం. దగా చేయడం కోసం ఇదో వంక. మరోసారి దీని గురించి తప్పకుండా మాట్లాడుకుందాం…).
పత్తి రైతుల ఆత్మ’హత్య’లే ఎక్కువ..:
రైతు చనిపోవడం అత్యంత విషాదకరం. అది ఆత్మహత్య అంటే .. చెప్పనలవి కాని అవాంఛనీయమైన, ఆందోళనకరమైన, అత్యంత సిగ్గుచేటైయిన విషాదం. పాలకుల నిసిగ్గుగా చెందిన దౌర్భాగ్య వైఫల్యం. ఒక్క క్షణం ‘సిగ్గు పడండ్రా’..! ఇక ప్రభుత్వం చెపుతున్న వైఫల్య లెక్కల ప్రకారం…
ఆత్మహత్యలు చేసుకునే రైతుల్లో అధికశాతం పత్తి రైతులే, అందులోనూ కౌలు రైతులు… ఐనా పత్తి వైపే మరల్చాలట…! సాగు చేయని రైతులకు కూడా ఏటా వేల కోట్ల రైతుబంధు ఇచ్చే ప్రభుత్వం కౌలు రైతులకు మాత్రం రూపాయి సాయం చేయదు… ఇదీ పాలసీ…! తీరా ఏమైంది..? పత్తి వేసి చేతులు కాల్చుకున్న రైతులు దాన్ని వేయడం తగ్గించేశారు… ఇప్పుడు పత్తి గణనీయంగా తగ్గిపోయింది. సర్కారు కిక్కుమనదు, అనలేదు… మొక్కజొన్న మళ్లీ పెరుగుతోంది.
‘వరి’ పెరిగింది ‘ఆయిల్ ఫాం’ దూల:
సరిపడా వర్షాల కారణంగా రాష్ట్రమంతా నీళ్లు కనిపిస్తున్నయ్, వరి పెరిగింది… ఇప్పుడు వరి రైతు ఏమైపోవాలి..? ఆమధ్య ‘ఆయిల్ పామ్ ధూంధాం’ అన్నారు… ఇక రాష్ట్రంలో ఎటుచూసినా పామాయిల్ మిల్లులు, చెట్లు అన్నట్టుగా ప్రచారం జరిగింది. నిజంగా ఆయిల్పామ్ సాగుకు అనువైన నేలల మీద, స్థిరమైన నీటి లభ్యత మీద సర్కారులో ఏ స్థాయిలో ఎవరికీ ఓ అవగాహన ఉన్నట్టు లేదు. రాష్ట్రమంతా ఏదో రైతు సమన్వయ సమితుల నెట్వర్క్ అన్నారు, ఇకపై వ్యవసాయాన్ని అదే నియంత్రిస్తుంది అన్నారు.
ఇదేం ప్రణాళిక…!?
అడిగే వాడు లేడు. తిట్టేడోడు లేడు. అచ్చోసిన ఆంబోతులకుమొదళ్ళు అసలే లేవు. దీనెమ్మ జీవితం…
ఏ ఊళ్లో, ఏ పొలంలో ఏ పంట వేయాలో అదే చెబుతుంది అన్నారు.! కొనుగోళ్లకు సమస్య లేదుపో అన్నారు.! ఎంత సింపుల్గా అంటే… ఏ ఊళ్లో పండిన పసుపు వాళ్లే దంచుకుని అమ్ముకోవాలట.! మిర్చిని పొడి చేసి మార్కెట్ చేసుకోవాలట…! ఏమైనయ్ ఈ సమితులు..? అవును మరి… పాలకుల మాటలకు పాలితులు ఎప్పుడూ అలుసే…పాలకులు ఏ ‘ఆకులు’ పీకుతున్నారో.. కనీసం తలెత్తుకోని ‘సిగ్గు’ పడండ్రా..! నీచుల్లార్రా.!
మొండి ‘మోడీ’నే.. మీరేంట్రా..!:
మరో విషయం చెప్పుకోవాలి ఇక్కడ..! మోడీ దొడ్డుబియ్యం కొనను అంటున్నాడు, అందుకే వరి వద్దు, వరి వేస్తే ఉరేసుకున్నట్టే అంటున్నారు కదా…! మోడీ దుర్మార్గుడే అనుకుందాం. ఓకే.! మరి రాష్ట్ర ప్రభుత్వ అధికారులో, ప్రజాప్రతినిధులో ఏం చేస్తున్నారు..? కేంద్రం కొనకపోతే ‘మన రైతుల్ని ఎలా ఆదుకోవాలి’ అనే ప్రత్యామ్నాయ ఆలోచనలు ఏవి..? ఎందుకు లేవు..? వేల కోట్లను రైతులకు ధారబోయడం కాదు, లాభసాటి వ్యవసాయానికి ఓ దిశను నిర్దేశించాలి, అదెందుకు చేతకావడం లేదు..? ఒక్కసారి ఈ నిల్వల పరిస్థితి చూడండి.
ఇదైనా తెలుసా..రా..! మీ బతుకులు ‘చెడ’:
మన ఆహారభద్రతకు ఉంచాల్సిన నిల్వలకన్నా దాదాపు 3.5 రెట్లు ఎక్కువ ఉన్నయ్.! అంతర్జాతీయంగా బాయిల్డ్ రైస్కు గిరాకీ లేదు. మనకన్నా వేరే దేశాలు మంచి దిగుబడులు, నాణ్యతను సాధిస్తున్నాయి. మన దేశంలోనే ఉప్పుడు బియ్యం ఎవరూ తినడం లేదిప్పుడు. 75 లక్షల టన్నుల గోధుమలు స్టాక్ ఉంటే సరిపోయే స్థితిలో ఇప్పుడు 6 కోట్ల టన్నులున్నాయి ఎఫ్సీఐ దగ్గర. వాటిని ఏం చేయాలి..? ఇదే కెసిఆర్ అక్కడ ఉంటే ఏం చేసేవాడు…? ఎఫ్.సి.ఐ తాజా నిల్వల స్థితికి సరిపడా గోదాముల్లేవు… ఇదో వైఫల్యం. తరుగులు, పందికొక్కులు, వర్షాలు, ఎలుకలు, డ్యామేజీ… కానీ ఒక్కటి మాత్రం నిజం… ప్రజల్ని ఆదుకోవడం అంటే మోడీకి చిరాకు.! కరోనా కాలంలో కూడా ప్రజలను ఆదుకోవడానికి ఉదారంగా ఆహారనిల్వల్ని మార్కెట్లోకి పుష్ చేయాలనే సోయి లేకుండా పోయింది.! ఎక్కువ పరిమాణంలో చేస్తే అది మార్కెట్లో ధరల్ని క్రాష్ చేసి, మళ్లీ నష్టపోయేది రైతులే.! అందుకే జాగ్రత్తగా చేయాల్సి ఉండింది. చేయలేదు. ఇక్కడ కేసీయార్ సర్కారు ఎంతో, అక్కడ మోడీ సర్కారు కూడా అంతే కదా…!!
మరేం చేయడం కరెక్ట్:
మనం ఇప్పటికీ ఆయిల్స్ దిగుమతి చేసుకుంటున్నాం. వేలకోట్ల విదేశీద్రవ్యం వెచ్చిస్తున్నాం. సరిపడా పప్పుదినుసుల సాగు లేదు. రైతుల్ని అటువైపు మళ్లించడమే కరెక్టు. శనగ, పల్లి, పెసర, కంది, మినుము, నువ్వులు, పొద్దుతిరుగుడు ఎట్సెట్రా… వాళ్లకు సరైన రైతుసాయం అందాలి. మార్కెటింగ్, భీమా భరోసా రైతుకు కావాలి. అది అవసరం కూడా. కానీ మోడీ మీదకు తప్పు నెట్టేయడానికి మాత్రమే కేసీయార్ ప్రయత్నం చేస్తున్నాడు.! సబ్జెక్ట్ తెలియని ఇక్కడి బీజేపీ నేతలు ‘బ్బెబ్బెబ్బె..!’ అంటున్నారు. అంతే తప్ప, తెలంగాణలో ఆచరణయోగ్యమైన, రైతు ప్రయోజనకరమైన ప్రణాళికలు ఏవీ..? అక్కడ మోడీకి పట్టదు, ఇక్కడ కేసీయార్కు పట్టదు… దొందూ దొందే…!! ఈ విషయంలో ఏ వెధవ ఫీల్ కావల్సిన అవసరం లేదు.
నోట్:
ఎవడైనా ‘ఫీల్’ అయి..కేసు పెడితే… పైన పేర్కొన్న మీ అసమర్థ నాయకులను కోర్టు బోనులో నిలబెట్టే విధంగా సెక్షన్లు ఉన్నాయ్. మారండ్రా.. ఇప్పటికైనా.. ( ప్రముఖ పరిశోధన పాత్రికేయులు అనంచిన్ని వెంకటేశ్వరరావు, 9440000009 ప్రత్యేకంగా అందిస్తున్నా కథనం)
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments